మన తెలుగు ఇండస్ట్రీలో రౌడీ హీరోగా బాగా పాపులర్ అయిన హీరో విజయ్ దేవరకొండ. ఇక సినిమాలు హిట్టు, ఫ్లాపు అన్న తేడా లేకుండా ఒకటి తర్వాత ఒక సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక ఇటీవల " వరల్డ్ ఫేమస్ లవర్ " తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఎంపిక చేసినట్లు సమాచారం. 

 

 

ఇక ఈ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత.. నిన్ను కోరి సినిమా దర్శకుడు శివ నిర్వాణ తో కలిసి సినిమా తీయాలనుకున్నరట. నిజానికి ఈ సినిమా పూరి జగన్నాథ్ సినిమాకంటే ముందే ప్రారంభం అవ్వాల్సి ఉంది. అయితే డియర్ కామ్రేడ్ సినిమాతో విజయం సాధించక నిరాశ చెందడంతో విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్ తో విజయం అందుకున్న పూరి జగన్నాథ్ తో సినిమాను ఒప్పుకోవడం జరిగింది. ఇక పూరితో సినిమా పూర్తయిన తర్వాత శివ నిర్వాణతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 

IHG

అంతే కాకుండా ఇంకో రెండు సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి విజయ్ కు. ఇక దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా తీయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా అర్జున్ రెడ్డి సినిమా కాంబినేషన్ మళ్లీ సెట్స్ మీదికి రావాలని సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇప్పటికే కథను కూడా వినిపించాడట. ఇక ప్రస్తుతం ఒప్పుకున్న మూడు సినిమాలు పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి సినిమాలో నటించడానికి సిద్ధం  అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: