మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎంటరయ్యాక ప్రతి విషయంపై స్పందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు సూచనలు చేయడం, అప్పుడప్పుడూ ఎంటర్ టైన్ చేయడం చేస్తున్నారు. ఇదే స్పీడ్ తో చిరంజీవి నిన్న స్టార్ హీరోయిన్ త్రిషకు బర్త్ డే విషెష్ చెప్పారు. ఇందులో విశేషమేమీ లేకపోయినా రీసెంట్ గా జరిగిన పరిణామాల నేపథ్యమే ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరంజీవి నటిస్తున్న ఆచార్య నుంచి త్రిష కొన్ని కారణాల వల్ల తప్పుకున్న విషయం తెలిసిందే. అయినా చిరంజీవి హుందాగా వ్యవహరించి త్రిషకు బర్త్ డే విశెష్ చెప్పారు.

 

 

త్రిష కూడా మెగాస్టార్ ట్వీట్ కు రిప్లై ఇచ్చింది. ‘థాంక్యూ టు ది స్వీటెస్ట్ లెజెండ్’ అని లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చి చిరంజీవికి తగిన గౌరవం ఇచ్చింది. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయని త్రిష చెప్పి ఆచార్య ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో టీమ్ కొంత అప్సెట్ అయింది. చిరంజీవి కూడా.. త్రిషకు సంబంధించి కాస్ట్యూమ్స్ డిజైన్ కూడా అయిపోయింది. మరో సినిమా కోసం ఆమె ఆచార్య నుంచి వెళ్లిపోయింది అని కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ కు త్రిషకు మధ్య గ్యాప్ వచ్చేసిందనే అనుకున్నారు. కానీ త్రిషకు చిరంజీవి బర్త్ డే విశెష్ చెప్పడంతో ఈ వివాదానికి తెర పడిందనే చెప్పాలి.

 

 

లాక్ డౌన్ పరిస్థితులు సద్దుమణిగాక ఆచార్య తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. త్రిష ప్లేస్ ను కాజల్ తో రీప్లేస్ చేశారు. చిరంజీవితో కాజల్ కు ఇది రెండో సినిమా. సోషల్ మీడియాలో చిరంజీవి యాక్టివ్ నెస్ కు అందరి నుంచీ మంచి అప్లాజ్ వస్తుంది. చిరంజీవి హుందాతనం అందరినీ ఆకట్టుకుంటోంది. మరోపక్క త్రిష తెలుగులో రవితేజ సినిమాకు సైన్ చేసిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: