యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే ఆస్ట్రియాలో పూర్తి చేసుకొని వచ్చింది చిత్ర బృందం. నాలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ మరియు యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే 1970 కాలానికి సంబంధించిన సినిమా కావడంతో కథకు తగ్గట్టుగా సెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి ‘జాన్’ అనే పేరుతో పాటు ‘ఓ డియర్', 'రాధే శ్యామ్’ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. బాహుబలి' తరువాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది ఆయన అతిపెద్ద యాక్షన్ ఎంటరైనర్ 'సాహో' తో పలకరించాడు. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరింది. తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినా బాలీవుడ్ లో మాత్రం సాహో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ప్రభాస్ - పూజా హెగ్డే కాంబోలో వస్తున్న మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.

 

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ మ్యూజిక్ టీచర్ గా కనిపించనుండదట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉంటుందట. ఇప్పటికే ఆమె లుక్ పై చాలా రూమర్స్ వచ్చాయి. అయితే దీని పై ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికి ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నాడట. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: