స్టార్ హీరోలతో పాటు
యువ హీరోలు కూడా పాన్
ఇండియా మార్కెట్ పై కన్నేశారు. అందులో భాగంగా
యువ హీరో నిఖిల్ నటిస్తున్న
కార్తికేయ 2 చిత్రాన్ని పాన్
ఇండియా వైడ్ విడుదలచేయాలనుకుంటున్నారు. ఇక తాజాగా ఈజాబితాలోకి
నితిన్ కూడా చేరాడు. ఇప్పటివరకు తెలుగులో తప్ప ఇతర భాషల్లో తన సినిమాలను విడుదల చేసుకోలేకపోయిన
నితిన్ తను నటించనున్న పవర్
పేట ను మాత్రం పాన్
ఇండియా సినిమా విడుదలచేయనున్నాడని సమాచారం.
కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరక్కనున్న ఈ చిత్రంలో
నితిన్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనుందట.
మణిశర్మ సంగీతం అందించనుండగా సత్యదేవ్ ,
రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో శ్రేష్ట్ మూవీస్ మరియు
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమాను నిర్మించనున్నాయి. ఇక ఈచిత్రంలో
నితిన్ సరసన
కీర్తి సురేష్ నటించనుందని ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే వీరిద్దరి కలిసి నటించడం ఇది రెండో సారి అవుతుంది.
ప్రస్తుతం ఈజోడి రంగ్ దే లోనటిస్తుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్నఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు లో విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు నితిన్ ,చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చెక్ అనే సినిమా చేస్తున్నాడు.ఇటీవలే రెండు షెడ్యూల్ లను కూడా పూర్తి చేసుకుంది. ఇవే కాకుండా నితిన్ బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ అందదున్ రీమేక్ లో కూడా నటించననున్నాడు.