సరిలేరు నీకెవ్వరు మూవీతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో సూప‌ర్‌స్టార్‌ మహేష్ తన నెక్స్ ట్  మూవీ ఇంకా ప్రకటించలేదు. అయితే వంశీ పైడిప‌ల్లితో చేయాల్సిన చిత్రం క‌థ న‌చ్చ‌క ఆయ‌న ఆ స్క్రిప్ట్‌ని ప‌క్క‌న పెట్టారు. ఐతే గీత గోవిందం దర్శకుడు పరుశురాంతో ఆయన మూవీ దాదాపు ఖరారైంది. పరుశురామ్ కూడా తన నెక్స్‌ట్‌ మూవీ మహేష్ తో అని క్లారిటీ ఇచ్చారు. ఇక అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. ఇక ఈ చిత్రంలో మహేష్ పూర్తిగా ఓ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. పురుశురాం ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ పాత్రకు సరిపోయేలా ఓ డిఫరెంట్ లుక్ డిజైన్ చేసి వుంచారట. కొన్నాళ్లుగా మహేష్ లుక్ లో మొనాటమీ వచ్చిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఆయన అన్ని సినిమాల‌లో ఒకే లుక్ లో కనిపిస్తున్నాడని కొందరు అంటున్నారు. 

 

ఈ విమర్శలకు చెక్ పెట్టేలా మహేష్ ఓ భిన్నమైన లుక్ ట్రై చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటిలోనే ఉంటున్న మహేష్ కొంచెం జుట్టు మరియు గెడ్డం పెంచారు. మరి ఆయన పరుశురామ్ మూవీ కోసమే అలా జుట్టు పెంచుతున్నారేమో. ఈ మూవీ పై అధికారిక ప్రకటన ఈనెల 31న వెలువడనుంది. మ‌రి ఇందులో మ‌హేష్‌కి జంట‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నారు. ఇక ప‌రుశురాం గీత‌గోవిందం త‌ర్వాత మంచి చిత్రాన్ని తీయ‌లేదు. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ ప‌రుశురామ్ కి ఎందుకో మంచి అవ‌కాశం రాలేదు. మ‌రి ఇన్ని రోజుల త‌ర్వాత మ‌హేష్ చాన్స్ ఇచ్చాడు మ‌రి ఈ చిత్రాన్ని ప‌ర‌శురామ్ ఎలా తీయ‌బోతున్నాడు. ఆ చిత్ర క‌థ క‌థనాలు ఏమిటి అన్న‌ది తెలియాల్సి ఉంది. 

 

ప్ర‌స్తుతం మ‌హేష్ ఫ్యామిలీతోనే గ‌డుపుతూ ఇంట్లోనే ఉంటున్నారు. త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ స‌మ‌యాన్ని వెళ్ళ‌దీస్తున్నారు. ఇక స్టార్ హీరోల‌కి ఇంత స‌మ‌యం దొర‌క‌డం చాలా అరుదు ఇలాంటి స‌మ‌యం అస‌లు ఎప్పుడూ కూడా స్టార్ల‌కి స‌మ‌యం దొర‌క‌డం అనేది చాలా అరుదు. దీంతో స‌మ‌యం దొరికింది క‌దా అని ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత మ‌యి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: