కరోనా వైరస్‌ లాక్‌ డౌన్‌ కారణంగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్‌ అమెరికాలోని తన ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది.  ఆ ఫోటోలతో పాటు `ఈ ఇయర్‌ మే మొదటి సోమవారం థీమ్‌: ప్రిన్సెస్‌. డైరెక్షన్‌ కృష్ణ, కెమెరా దివ్య జ్యోతి` అంటూ పోస్ట్ చేసింది పీసీ. ఈ ఫోటోలో ప్రియాంక చోప్రాకు ఆమె కోడలు కృష్ణ చిన్న కిరీటాన్ని తొడుగుతున్న ఫోటోతో పాటు ఆమెకు మేకప్ వేస్తున్న ఫోటోలను ఉన్నాయి.


బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన అందాల భామ ప్రియాంక చోప్రా. వయసులో తనకంటే చాలా చిన్నవాడైన సింగర్‌ నిక్‌ జోనాస్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ విదేశాల్లోనే నివసిస్తోంది. అయితే బారతీయ ప్రేక్షకులకు వెండితెర మీద మిస్‌ అయినా సోషల్‌ మీడియా ద్వారా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది పీసీ. తాజాగా ప్రియాంక చోప్రాచేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో అభిమానులు ఫన్నీ రిప్లైలు ఇస్తున్నారు. అంతకు ముందు తన కొడలు కృష్ణతో కలిసి సోఫాలో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోకు 11 లక్షలకు పైగా లైక్స్ రాగా.. 4500 వందలకు పైగా కామెంట్స్ వచ్చాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

First monday in May ⁣ This year’s theme: Pretty Pretty Princess ⁣ Glam and creative direction by: @sky.krishna 📸- @divya_jyoti

A post shared by priyanka chopra Jonas (@priyankachopra) on

మరింత సమాచారం తెలుసుకోండి: