టాలీవుడ్ లో ఈ మద్య యంగ్ హీరోలు తమ సత్తా చాటుకుంటున్నారు. ఒక్క హిట్ పడితే కొంత కాలం పాటు వారి కెరీర్ సాగుతుందన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి ఒక్క సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇక మంచి ఛాన్స్ కోసం ఎదురు చూసే కుర్ర హీరోలు స్టార్ హీరో తో మల్టీస్టార్ మూవీలో ఛాన్స్ కొడితే.. ఆ మూవీ హిట్ అందుకుంటా వాళ్ల అదృష్టం పండినట్లే అంటారు. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది.
ఆ మద్య 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించబోతున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే, ఆ వార్తలను నవీన్ ఖండించాడు. తనకు అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని చెప్పాడు.. ఇవన్నీ ఒట్టి రూమర్లే అని ఖండించాడు. తాజాగా తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. 'వంగవీటి', 'జార్జిరెడ్డి' సినిమాల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సందీప్ మాధవ్ ఈ మూవీ ఛాన్స్ కొట్టేశాడనే వార్త వినిపిస్తోంది. సినిమాలో బాలయ్యకు అత్యంత దగ్గరగా ఉండే పాత్రలో సందీప్ నటించబోతున్నాడనని చెబుతున్నారు. ఒకప్పుడు ఉద్యమ లీడర్ గా జార్జిరెడ్డి ఎంతో గొప్ప పేరు ఉందో అందరికీ తెలిసిందే.. ఆయన చరిత్ర ఆదారంగా వచ్చిన మూవీ మంచి హిట్ అందుకుంది.
ఈ మూవీలో సందీప్ మాధవ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతకు ముందు కూడా వర్మ దర్శకత్వంలో వంగవీటి తో మరో బయోపిక్ లో నటించాడు. ఇలా రెండు మూవీస్ బయోపిక్ రావడం కూడా ఈ హీరోకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక సందీప్ కూడా ఈ పాత్రకు అంగీకారం చెప్పాడని సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత కరోనా పరిస్థితులు కొంత చక్కబడిన తర్వాత సినిమాకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు బోయపాటి ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే.