జూనియర్ ఎన్టీయార్ దర్శకుడు త్రివిక్రం కాంబోలో మూవీ వస్తుందన్నది తెలిసిందే. ఈ మూవీ కోసం కధ రెడీ అయిందని అంటున్నారు. ఇందులో ఎన్టీయార్ పాత్రను కూడా త్రివిక్రం బాగా డిజైన్ చేశాడని అంటున్నారు. కొత్త ఎన్టీయర్ని చూపిస్తారని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే లాక్ డౌన్ వచ్చి మొత్తం సీన్ మార్చేసేలా ఉందిట.

 

జూనియర్ ఎన్టీయార్ గత రెండేళ్ళుగా ఆర్.ఆర్.ఆర్ మూవీతోనే లాక్ అయిపోయాడు. రాజమౌళి మూవీ అంటేనే రెండేళ్ళు అని తెలిసి తెలిసి జూనియర్ సైన్ చేశాడు, అరవింద సమేత మూవీ తరువాత మళ్ళీ జూనియర్ మూవీ ఏదీ లేదు. ఇక లాక్ డౌన్ తో భారీ సినిమాలు అన్నీ కూడా డేటూ ఫేటూ మార్చుకున్నాయి.

 

దాంతో ఆర్.ఆర్.ఆర్ మూవీ ఎన్నాళ్ళకు షూటింగ్ జరుగుపుకుని రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఇక ఆ తరువాత త్రివిక్రం మూవీ  ఎపుడు వస్తుందో కూడా ఎవరూ ఊహించలేరు. దాంతో ఈ గ్యాప్ లో వెంకటేష్ తో ఓ సినిమా చేసేందుకు త్రివిక్రం రెడీ అవుతున్నాడట. ఇపుడు ఈ టాక్ తో జూనియర్ కొంత అసంత్రుప్తిగా ఉన్నాడని అంటున్నారు.

 

అల వైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వెంటనే తమ కాంబోలో మూవీ వస్తే ఆ హైప్ వేరేగా ఉంటుందని జూనియర్ ఆలోచనట. అలా కాకుండా మధ్యలో వెంకటేష్ మూవీ చేస్తే అది కాస్తా అటూ ఇటూ అయితే ఆ ఇంపాక్ట్ తమ కాంబో మీద పడుతుందని జూనియర్ ఆలోచిస్తున్నాడని అంటున్నారు.

 

మరి త్రివిక్రం మాత్రం గ్యాప్ ఎక్కువ ఉంటే తన కెరీర్ ఇబ్బందులో పడుతుందని, వెంకటేష్ తో మూవీ చేసుకుని ఆ వెంటనే జూనియర్ తో మూవీ చేయాలనుకుంటున్నారని అంటున్నారు. మరి చూడాలి జూనియర్ త్రివిక్రం మధ్యలో వెంకటేష్.. ఈ రెండు ప్రాజెక్టులూ పట్టాలెక్కుతాయా లేదా అన్నది చూడాల్సిందే. .

 

మరింత సమాచారం తెలుసుకోండి: