తనపై ఫేక్ వార్తలు రాస్తున్న కొన్ని వైబ్ సైట్లకు వ్యతిరేకంగా ఓ యుద్ధం మొదలుపెట్టాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ‘కిల్ ఫేక్ న్యూస్, కిల్ గాసిప్ వెబ్ సైట్స్’ అంశాలతో విజయ్ దేవరకొండ ఈ విప్లవం తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నినాదాలతో ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇండస్ట్రీ టాప్ సెలబ్రిటీలు అంతా ఏకమై విజయ్ కు మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో విజయ్ మరో ఘనత సాధించి కూడా వార్తల్లో నిలుస్తున్నాడు.

 

 

సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లను సాధించి ఏకంగా సౌత్ ఇండియా నెంబర్ వన్ గా నిలిచాడు. ఏకంగా 7మిలియన్ ఫాలోవర్లను సాధించి ఇప్పటి వరకూ టాప్ లో ఉన్న అల్లు అర్జున్ ని వెనక్కి నెట్టాడు. అల్లు అర్జున్ ఫాలోవర్స్ సంఖ్య 6.7 మిలియన్ ఫాలోవర్స్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. బన్నీ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ 4.6 మిలియన్ ఫాలోవర్స్ తో మూడో ప్లేస్ లో ఉన్నాడు. దీంతో అందరినీ వెనక్కు నెట్టి విజయ్ దేవరకొండ సౌత్ ఇండియాలోనే టాప్ ప్లేస్ లో నిలిచాడు. వీరి తర్వాత ప్లేస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా ఉన్నారు.

 

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ సౌత్ లో ఎలా ఉందో ఇన్ స్టా ఫిగర్స్ నిరూపిస్తున్నాయి. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్టార్ట్ చేసి కరోనా సమయంలో సామాన్యుల కోసం ఫండ్ రైసింగ్ చేస్తున్నాడు విజయ్. దీనిపై కొన్ని వెబ్ సైట్స్ వ్యతిరేక వార్తలు రాయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. దీంతో ప్రస్తుతం విజయ్ పేరు మోగిపోతోంది. తమిళ పరిశ్రమ నుంచి కూడా విజయ్ కు మద్దతు వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: