ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ల నిజ జీవిత పాత్రలతో ఫిక్షన్ బ్యాగ్డ్రాప్ లో భారీ మల్టీ స్టారర్ గా రాజమౌళి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రాం చరణ్ పాత్ర కి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం త్వరలో ఎన్.టి.ఆర్ పాత్ర కి సంబంధించిన టీజర్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. 

 

అయితే ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం దర్శకత్వంలో నటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎన్.టి.ఆర్ మైల్ స్టోన్ సినిమా (30) కావడం విశేషం. "అయినను పోయిరావలే హస్తినకు" అన్న టైటిల్ తో తెరకెక్కబోయో ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుందని సమాచారం. ఇంతకముందు ఎన్.టి.ఆర్-త్రివిక్రం-పూజా హెగ్డే కాంబినేషన్ లో అరవింద సమేత వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం త్రివిక్రం ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు.

 

ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఎన్.టి.ఆర్ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తాడట. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కే.జి.ఎఫ్ 2 ని కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాని ఆగస్టు లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా స్క్రిప్ట్ సిద్దం చేస్తాడట. అంతేకాదు ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రాం కూడా నటిస్తాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎన్.టి.ఆర్, నందమూరి కళ్యాణ్ రాం కలిసి నటించకపోవడంతో ఇప్పుడు ఇద్దరు కలిసి నటించే విధంగా స్క్రిప్ట్ సిద్దం కానుందట. ఇక ఈ సినిమా ఎన్.టి.ఆర్ 31 వ సినిమాగా తెరకెక్కనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: