దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ వంటి హిస్టరీ క్రియోట్ చేసి తెలుగు సినిమా సత్తాని చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు దేశం మొత్తం ఈ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

 

ఇక ఈ సినిమాను 2021 సంక్రాంతి టార్గెట్ గా రాజమౌళి సిద్దం ఆర్.ఆర్.ఆర్ ని సిద్దం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రాం చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో టీజర్ చేసినప్పటి నుండి నందమూరి ఫ్యాన్స్ తమ స్టార్ వీడియో టీజర్ ఎప్పుడొస్తుందా అంటూ తెగ ఆరాటపడుతున్నారు. కాని కొన్ని రోజులుగా ఈ సినిమా నుండి ఇప్పట్లో తారక్ పాత్ర కొమరం భీం కి సంబంధించిన వీడియో టీజర్ వచ్చే అవకాశాలు లేవంటూ ప్రచారం జరుగుతుంది. దాంతో ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎన్.టి.ఆర్ బర్త్ డే కి ఖచ్చితంగా సర్‌ప్రైజ్ ఉంటుందని ఆశించారు. 

 

అయితే అందరూ ఆశించినట్టుగానే ఎన్.టి.ఆర్ బర్త్ డే సందర్భంగా మే 20 న కొమరం భీం పాత్రకి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేయనున్నారట. ఇది ప్రేక్షకులందరికి పెద్ద సర్‌ప్రైజ్ కాబోతుందని తాజా సమాచారం. ఇప్పటికే రాజమౌళి టీం ఈ టీజర్ ని తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారట. ఎన్.టి.ఆర్ స్టామినాకి తగ్గట్టుగా హై ఓల్టేజ్ లో ఈ టీజర్ ఉండబోతుందని ఈ టీజర్ తో ఆర్.ఆర్.ఆర్ సినిమా రేంజ్ ఏంటో తెలియబోతుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే తారక్, చరణ్ ఇద్దరు రాజమౌళి సినిమాలో నటించి భారీ సక్సస్ లను అందుకొని ఉన్నారు. అందరూ అనుకుంటున్నట్టు కాకుండా ఆరోజు జరగబోయోది ఒక సంచలనం అవబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: