ఎవరైనా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం అంత సులభం కాదు. పైగా 20-25 ఏళ్ళ నుండి సాధించిన క్రెడిట్, క్రేజ్, ఛరిష్మా ..ప్రేక్షకుల్లో అసాధారణమైన పాపులారిటి ని తనయులు దక్కించుకోవాలంటే ఎంతమాత్రం సాధ్యపడే విషయం కాదు. కాని ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ అతి తక్కువ కాలంలోనే తండ్రిని మించిపోయాడని అందరి చేత అనిపించుకుంటున్నాడు..

 

రాం చరణ్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో రికార్డ్స్ మోత మోగించాడు. చరణ్ కెరీర్ లో కేవలం రెండవ సినిమా గా వచ్చిన మగధీర అప్పటి వరకు నమోదైన చాలా సినిమాల రికార్ద్స్ ని బద్దలు కొట్టింది. ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను చరణ్ కి అసాధారణమైన క్రేజ్ వచ్చింది. 

 

మగధీర సినిమాతో రాం చరణ్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిపోయాడు. అంతేకాదు తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాతో నిర్మాతగాను మారాడు. ఇంత చిన్న వయసులో నిర్మాతగా మారడం అందులో ఖైదీ నంబర్ 150, సైరా వంటి భారీ సినిమాలను నిర్మించడం ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అల్లు అరవింద్ లాంటి లెజండరీ ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా ఏమాత్రం అనుభవం లేని రాం చరణ్ నిర్మాతగా సక్సస్ అయ్యాడు. ఇక సైరాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలన్న సాహసం చూస్తే స్టార్ ప్రొడ్యూసర్స్ కి కూడా ముచ్చటేస్తుంది. దాంతో చిరంజీవి కొడుకు రాం చరణ్ ని చూసి ఎంతో గర్వపడుతున్నారు. 

 

అంతేకాదు మగధీర లాంటి సినిమా కెరీర్ ప్రారంభంలోనే చేసి రికార్డ్స్ తిరగరాయడం, ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండం ..మరో వైపు ఆచార్య సినిమా కి సంబంధించిన వ్యవహారాలని చూసుకోవడం లాంటి విషయాలు ఇప్పుడు చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. చరణ్ చేస్తున్నన్ని సాహసాలు నేను నా కెరీర్ ప్రారంభంలో చేయలేదని ఇంతటి భారీ సక్సస్ లు అందుకోలేదని మగధీర, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలు, రాజమౌళి లాంటి దర్శకులు నాకు దొరకలేదని ...ఈ విషయాలన్నిటిలో చరణ్ ఎంతో అదృష్టవంతుడని చెప్పుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: