ప్రస్తుతం ఫేక్ వెబ్సైట్ ముసలోడి గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కటిగా ఫేక్ న్యూస్ రాజా లీలలు   బయటపడుతూ వస్తోన్నాయి . అయితే విజయ్ దేవరకొండ... దేవరకొండ అనే ట్రస్ట్  స్థాపించి వేల కుటుంబాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటే విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ ఇవ్వలేదని విజయ్ దేవరకొండ పై ఫేక్ వార్తలు రాయడంతో ఒళ్ళు మండిన విజయ్ దేవరకొండ ఆ ఫేక్ వెబ్ సైట్ ని ఏకిపారేసిన విషయం తెలిసిందే. ఆ వెబ్సైట్ పేరేంటో చెప్పలేదు కానీ ఆ వెబ్సైట్ చేసిన చెడ్డ పని మొత్తం పూస గుచ్చినట్లు చెబుతూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. దీనికి విజయ్ కి  టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అండగా నిలిచిన విషయం తెలిసిందే.

 

 

 ప్రస్తుతం ఆ ఫేక్ న్యూస్  రాసిన జర్నలిస్ట్ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా ఫేక్ న్యూస్ రాజా  బెదిరింపులకు చాలా మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర పరిశ్రమలో ఫ్యాషన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చిన్నపాటి నిర్మాత గా రూపాంతరం చెంది బాగా పేరు సంపాదించిన వ్యక్తి... ప్రస్తుతం ఈ ఫేక్ న్యూస్ వసూల్ రాజా గురించి కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఆ చిన్న దర్శకనిర్మాత ఫేక్ న్యూస్ వసూల్ రాజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు... సినిమా రిలీజవుతుందంటే చాలు బ్లాక్ మెయిల్ కి దిగడానికి సిద్ధంగా ఉంటాడని.... భారీ మొత్తంలో డబ్బులు అడుగుతానని... అడిగినంత ఇవ్వకపోతే తమ సినిమా పై దుష్ప్రచారం చేస్తూ...రేటింగ్  తక్కువ ఇస్తామని బెదిరింపులకు కూడా పాల్పడతారు అంటూ చిన్నపాటి దర్శకనిర్మాత వాపోతున్నాడు. 

 

 

 మరి ఆ చిన్నపాటి దర్శక నిర్మాత ఎవరు అన్నది ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనునట్లు తెలుస్తోంది. ఆ దర్శకనిర్మాత తెర మీదికి వచ్చి ఈ ఫేక్ న్యూస్ వసూల్ రాజా గుట్టు రట్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.. తన వద్ద ఉన్న ఆధారాలతో పాటు మరికొంతమంది బాధితులను కూడా తెలుసుకొని వారి దగ్గర ఆధారాలతో మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారట ఆ  దర్శకనిర్మాత . దీంతో కేవలం ఆ ముసలోడు ఫేక్ న్యూస్ లు రాయడమే కాదు.... మంచి వసూళ్లు రాజా కూడా  చేస్తాడని అని అనుకుంటున్నారు ఇండస్ట్రీ మొత్తం. ఇక ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వాళ్ళందరూ విజయ్ దేవరకొండ  మాటలతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: