నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత సంవత్సరంన్నర గ్యాప్ తీసుకున్న బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అప్పటి వరకు రంగస్థలం పేరు మీద ఉన్న నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డుని చెరిపేసి తన సినిమా పేరుని రాసుకున్నాడు. అల వైకుంఠపురములో సినిమా టైమ్ లో నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలని చూసినపుడు, బన్నీ తర్వాతి చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని అర్థమైంది.

 

 

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఎర్రచందనం స్లగింగ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో సాగే ఈ కథలో బన్నీ చిత్తూరు యాసని మాట్లాడుతాడట. ఇప్పటికే రిలీజైన పుష్ప ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊర మాస్ గెటప్ లో బన్నీ లుక్ అదిరిపోయిందని అన్నారు. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా కనిపిస్తున్న బన్నీ రంగస్థలంలో రామ్ చరణ్ ని గుర్తు చేశాడు.

 

కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవలేదు. అయితే ఈ సినిమా పూర్తి కమర్షియల్ చిత్రమే అయినప్పటికీ, బన్నీ సినిమాల్లో ఉండే కమర్షియల్  అంశాలు ఇందులో ఉండవని అంటున్నారు. బన్నీ సినిమాలో డాన్సులకి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో అలాంటివేమీ ఉండడానికి ఆస్కారం లేదట. సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో అడవుల్లో జరుగుతుంది కాబట్టి స్టైలిష్ డాన్సెస్, ఉండవట.

 


అయితే అల్ట్రా స్టైలిష్ డాన్సెస్ లేకపోయినా ఐటెం సాంగ్ ఉంది కాబట్టి, ఆ పాటలో బన్నీ మాస్ స్టెప్స్ తో అదరగొడతారని అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో బన్నీ సరసన స్టెప్పులు వేయడానికి బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటానీని సెలెక్ట్ చేశారని సమాచారం. ఇప్పటికైతే ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: