అక్కినేని నాగచైతన్య గత కొన్ని రోజుల నుండి సక్సెస్ ట్రాక్ లో నే ఉన్నాడు. మజిలీ, వెంకీ మామా చిత్రాల ద్వారా మంచి విజయాలని అందుకున్నాడు. ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి హీరోయిన్ గా లవ స్టోరీ అనే సినిమాలో చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై బాగా ఆసక్తి ఏర్పడింది.

 

 

ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ గ్రామీణ ప్రాంత కుర్రాడిలా కనిపించనున్నాడట. అందుకోసం తెలంగాణ యాసని కూడా నేర్చుకున్నాడట. అయితే ఈ సినిమా అనంతరం నాగచైతన్య మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నాగచైతన్య, గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయాల్సింది.

 

 


కానీ పరశురామ్ వేరే స్టర్ హీరోతో అవకాశం రావడం ఈ సినిమా పక్కకి పోయిందని టాక్. అయితే నాగచైతన్య ఓ బేబీ సినిమాతో హిట్ కొట్టిన దర్శకురాలు నందినీ రెడ్డితో సినిమా చేస్తానని ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల నాగచ్చైతన్య నందినీ రెడ్డితో సినిమా చేయడానికి రెడీగా లేడట. లవ్ స్టోరీ తర్వాత ఇంద్రగంటి మోహన క్రిష్ణ దర్శకత్వంలో ఒక సినిమా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నాడట.

 

 

దాంతో నందినీ రెడ్డితో సినిమా పక్కకి పోయిందని అంటున్నారు. ఇప్పటికైతే ఈ విషయమై అధికారిక సమాచారం రాలేదు. కరోనా లాక్డౌన్ కారణంగా లవ్ స్టోరీ సినిమా ఆగిపోవడంతో.. కొంత అయోమయంలో పడ్డాడట. లాక్డౌన్ పూర్తయ్యాక లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయితే గానీ తర్వాతి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది చెప్పలేం అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: