2011 వ సంవత్సరంలో విడుదలైన అలా మొదలైంది చిత్రంలో హీరో నాని సరసన నటించిన మలయాళం అమ్మాయి నిత్యామీనన్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. ఆ రెండు చిత్రాల తర్వాత వచ్చిన సెగ, 180 మూవీలలో తాను నటించింది కానీ అవి అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. 2012 లో నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నిత్య మీనన్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. వాస్తవానికి నిత్యామీనన్ అందమైన ముఖమును చుసేందుకు, ఆమె ముద్దు ముద్దు మాటలను వినేందుకే చాలామంది సినీ అభిమానులు థియేటర్లకు వచ్చారు అంటే అతిశయోక్తి కాదు.


నితిన్ కెరీర్ని గాడిలో పడేసింది నిత్యామీనన్ అని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. 2013వ సంవత్సరంలో మళ్లీ నితిన్, నిత్యామీనన్ కలసి గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నటించి మరొక బ్లాక్ బాస్టర్ హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, గీత గోవిందం లాంటి ఇంకా ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో, గొప్ప నటన ప్రదర్శనతో అందరి మనసులు దోచేసింది నిత్యామీనన్.


సూర్య సరసన 24 సినిమాలో, రాఘవ లారెన్స్ సరసన కాంచన మూవీ లో ఆమె నటన కు తెలుగు తమిళనాడు రాష్ట్రాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆమె అందచందాలకు ఫిదా అయిన బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఆమెకు ఎన్నో సినిమా ఆఫర్లు ప్రకటించింది. అయితే ఆమె అక్షయ్ కుమార్ హీరోగా నటించిన మిషన్ మంగల్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. కేవలం నటించడం మాత్రమే కాదు ఈమె చాలా చక్కగా పడుతుంది కూడా. ఏది ఏమైనా నిత్యామీనన్ పై మనసు పారేసుకున్న మంది లక్షల సంఖ్యలో ఉండే ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: