ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు బాహుబలి లాంటి ఇంటర్నేషనల్ హిట్  సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ స్టార్ హీరో క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది. అయితే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ సాహో అనే ఒక భారీ యాక్షన్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతగా ఆకట్టుకోలేక పోయినా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

 

 

 ఇక ఈ సినిమా తర్వాత వైవిధ్యమైన కథలను తెరకెక్కించే దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ క్రేజ్ బాగా ఉంది కాబట్టి నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న  ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో  తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా ప్రభాస్ 70 కోట్ల వరకు చార్జి చేసినట్లు తెలుస్తోంది. ఒకే ఏడాదిలో ఈ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయట. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ నటించబోతున్నట్లు సమాచారం. 

 

 

 అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు అంటే ప్రభాస్ ఢీకొట్టే విలన్ పాత్రలో కూడా ఒక ప్రముఖ నటుడు ఉండాల్సిందే కదా. అందుకే విలన్ క్యారెక్టర్ కోసం అరవింద్ స్వామి ని తీసుకోవాలనే ఆలోచనలో ఉందట. చిత్రబృందం. దీనికి  సంబంధించి అరవిందస్వామిని ఫోన్ ద్వారా  సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని పాత్రలను అరవింద స్వామి కి ఫోన్ ద్వారా చెప్పగా ఆయన కూడా ఓకే చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధ్రువ  సినిమాలో అరవిందస్వామి విలన్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మరి ప్రభాస్ లాంటి హీరోని తన విలనిజంతో ఎలా ఢీ కొట్టబోతున్నాడు  అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: