ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది. దీనితో సినీ ప్రముఖులు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో ప్రముఖ స్టార్లు కొందరు చాలెంజ్ లు అంటూ... మరికొందరు వారు ఎన్నడూ చేయని పనులు చేస్తూ ఇంట్లో సమయాన్ని గడుపుకుంటున్నారు. ఇక మరికొందరు అయితే వివిధ రకాల పనులతో కుస్తీలు పడుతున్నారు అని చెప్పాలి. కొంతమంది లాక్ డౌన్ సమయంలో ఫిట్ నెస్ అంటూ... మరి కొందరు ఈ సమయాన్ని వాల్ల టాలెంటు నిరూపించడంలో నిమగ్నమయ్యారు.

IHG

అంతేకాకుండా వాల్లు చేయాలి అనుకున్న పనులు నేర్చుకోవాలనుకున్న విద్యలు లాక్ డౌన్ సమయంలో చేస్తున్నారు. ఇక తాజాగా ముంబై బ్యూటీ రుహాణి శర్మ ఈ లాక్ డౌన్ సమయంలో తెలుగు నేర్చుకునేందుకు తయారైంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు చి.ల.సౌ. సినిమాతో పరిచయం అయింది. ఇక ఇటీవల హిట్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. 

IHG

ఇక రాబోయే రోజులలో ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్లు వస్తున్న తరుణంలో తెలుగు నేర్చుకునేందుకు పనిలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగు నేర్చుకోవడానికి ఇంటర్నెట్ లో రోజుకు రెండు గంటల సమయం కేటాయిస్తుంది ఈ భామ. అలాగే హైదరాబాదులో ఉన్న తన ఫ్రెండ్ తో ద్వారా కూడా తెలుగు పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ బ్యూటీ త్వరలో ఎమ్మెస్ రాజు దట్టి హరి, మంచు విష్ణు, "మోసగాళ్లు"  సినిమాను అవసరాల శ్రీనివాస్ వీరితో కలిసి క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: