మీరా చోప్రా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `బంగారం` చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టింది మీరా చోప్రా. బ‌ంగారం సినిమాలో న‌టించిన‌ప్పుడు చిన్న పిల్లలా కనిపించిన ఈ బాలీవుడ్ భామకు.. తెలుగులో అసలు హిట్లే తగల్లేదు.   వాన, నితిన్‌తో మారో, గ్రీకువీరుడు ఇలా తెలుగులో మూడు నాలుగు సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలేవి ఈమెకు మంచి బ్రేక్ ఇవ్వ‌లేక‌పోయాయి. దీంతో మీరా చోప్రా టాలీవుడ్‌ను వ‌దిలేసి.. బాలీవుడ్‌కు మ‌ఖాం మార్చేసింది. తెలుగులో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయినా.. బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటి భాగానే రాణిస్తోంది. 

 

ఇదిలా ఉంటే.. మీరా చోప్రా తండ్రిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి ఆయన ఫోన్‌ను దోచుకెళ్లారు. ఈ విషయాన్ని మీరా చోప్రా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఢిల్లీలోని పోలీస్ కాలనీలోనే ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఢిల్లీలోని పోలీస్ కాలనీలోనే ఈ ఘటన జరిగిందని, వాకింగ్‌ వెళ్లిన తన తండ్రిని స్కూట‌ర్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండ‌గ‌లు క‌త్తితో బెదిరించి ఫోన్ దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పోలీసు కమిషనర్‌కు మొర‌పెట్టికుంది. ఎంతో సురక్షిత ప్రాంతమని చెప్పుకుంటున్న ఢిల్లీలోనే ఇలాంటి ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.

 

దీంతో నార్త్ ఢిల్లీ డీసీపీ వెంట‌నే స్పందించి మ‌రిన్ని వివ‌రాలు ఇవ్వాల‌ని కోరారు. మీరా చోప్రా స‌మాధాన‌మిస్తూ...పీసీఆర్‌ పోలీస్‌ లేన్‌, మోడల్‌ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్‌ రోడ్డులో ఈ చోరీ జరిగిందని మ‌రిన్ని వివ‌రాలు ఇచ్చారు.  ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్ర‌స్తుతం మీరా చోప్రా  సెక్షన్ 375 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఈ 375 సినిమాతో పాటు మొగలి పువ్వు అనే ఆమె సినిమా ఒకటి తెలుగులో కూడా త్వరలో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: