రామ్ గోపాల్ వర్మ... సంచలనాత్మక దర్శకుడు, వివాదాస్పద దర్శకుడు. ఎవరిని ఎప్పుడు ఎలా గిల్లాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఈయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా అనేది ఈయన వాడకానికే పుట్టిందా అనే రేంజ్ లో వాడుతుంటారు. ఆఖరుకు తన సినిమాల్ని కూడా సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా ప్రచారం చేసుకుంటుంటారు వర్మ. సోషల్ మీడియాలో ఈయన గెలకని సెలెబ్రెటీ ఉండడు. ఆర్జీవీ సినిమాలతో కంటే ఇలా సెలెబ్ట్రీటీలను ట్రోల్ చేస్తూ ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ ఎటువంటి విచిత్రమైన వ్యక్తో ఆయన వేసే ట్వీట్స్ చూస్తే అర్థమవుతుంది. సామాన్యులకు ఏ మాత్రం అర్థం కాని విధంగా అంతుచిక్కని చిక్కు ప్రశ్నల్లా అనిపించే వాటిలో నిగూఢంగా ఓ సెటైర్ దాగి ఉంటుంది. అదే ఆర్జీవీ స్టైల్. ఆయన ఎప్పుడు ట్వీట్ చేసినా అదొక వార్త అవుతుంది.. సంచలనం అవుతుంది. అది డోనాల్డ్ ట్రంప్ అయినా నరేంద్రమోడీ అయినా కేసీఆర్ అయినా సినీ హీరోలైనా.. ఎవ్వరైనా సరే వర్మ ట్వీట్ శైలి మాత్రం మారదు. మెగాస్టార్, పవర్ స్టార్, ఆ స్టార్.. ఈ స్టార్ అని తేడా లేకుండా అందర్నీ ట్రోల్ చేస్తూ ఉంటాడు. అయితే అంతకు మించి ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళున్నారు. రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఇప్పుడు వాళ్ళకి పని చెప్పాడు. ట్రోలింగ్ కి సిద్ధమయ్యాడు. ఇప్పుడు మరో వెటకారపు ట్వీట్ తో మన ముందుకు వచ్చాడు. 

 

తాజాగా ఆయన వేసిన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించినదో నెటిజన్లకు అర్థం కావడం లేదు. ''వావ్ నువ్వు ఎప్పటికీ గొప్ప తెలివగల వాడివి.. నీ విశ్లేషణా సామర్థ్యం ముందు ఐన్ స్టీన్ కూడా మూగబోయేవాడు.. నీ బుద్ధికి, మెగా బ్రిలియన్స్‌ కు కుడోస్'' అంటూ ఓ ట్వీటేశాడు ఆర్జీవీ. అయితే ఇందులో మెగా అనే పదం వాడటంతో ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించిన ట్వీట్ అయి ఉంటుందని మెజార్టీ నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ ట్వీట్‌ కంటే మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్స్‌ను గమనిస్తే ఎంతో కొంత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మద్యం షాపులు ఓపెన్ చేయడంపై నాగబాబు వరుస ట్వీట్స్ చేశాడు. ఇంతకాలం మద్యం కావాలి మొర్రో అంటూ వర్మ ట్వీట్ల వర్షం కురిపించేవాడు. అయితే నాగబాబు మద్యం షాపులు ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకించడంపై వర్మ ఇలా సెటైరికల్‌గా స్పందించి ఉండొచ్చు. ఇక వర్మ చేసిన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించినదో తెలీక కొందరు తలలు పట్టుకుంటే.. మరికొందరు పవన్ కళ్యాణ్‌ను అయి ఉంటుందని, ఇంకొందరు విజయ్ దేవరకొండ, డోనాల్డ్ ట్రంప్ అని చెప్పగా.. మెజార్టీ నెటిజన్స్ నాగబాబు అంటూ కామెంట్స్ చేశారు. నాగబాబు చేసిన ట్వీట్స్‌ను జత చేసి వీటికే ఆర్జీవీ కౌంటర్ ఇచ్చి ఉండొచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆర్జీవీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: