టాలీవుడ్ లో క్రియేటివ్ కథా చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించిన సుకుమార్ తీస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. యువ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా కథ, కథనాలను ఎంతో గొప్పగా తయారు చేసాడట సుకుమార్. 

 

ఇక ఇటీవల కొద్దిరోజుల క్రితం శేషాచలం అడవుల్లో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నిలిపివేయబడింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా పక్కా మాస్ రోల్స్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎంతో మాస్ స్టైల్ లో అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ సినిమా కథని సూపర్ స్టార్ మహేష్ బాబు కు వినిపించారట సుకుమార్. కథ బాగున్నప్పటికీ, ఇంత పక్కా మాస్ స్టైల్ తనకు సూట్ కాదని మహేష్సినిమా చేయలేనని అన్నారంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. 

 

అయితే ఈ సినిమా విషయమై ప్రస్తుతం మరొక వార్త ప్రచారం అవుతూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కొంత భయాన్ని సృష్టిస్తోందట. మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాలో కథ, కథనాలు కూడా అంతగా ఆకట్టుకునే రేంజ్ లో లేవని, సుకుమార్ గతంలో తీసిన రంగస్థలం మాదిరిగా ఈ స్క్రిప్ట్ కూడా సాగనుండడంతో మహేష్ ఈ సినిమాని వద్దనుకున్నారని, అంతేతప్ప మాస్ సినిమా చేయలేక కాదని అంటున్నారు కొందరు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తిగా వాస్తవాలు వెల్లడి కావలసి ఉందని, అప్పటి వరకు దీనిని నమ్మలేం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. లాక్ డౌన్ అనంతరం మిగతా షూటింగ్ ని పూర్తి చేసి వీలైనంత త్వరగా తమ పుష్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని అంటోంది సినిమా యూనిట్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: