టాలీవుడ్ లో తక్కువ కాలంలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన. గీత గోవిందం సినిమా ద్వారా ఆమె మంచి హిట్ కొట్టి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆమె కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వరుస సినిమాలు ఆమెకు సూపర్ హిట్ ఇచ్చాయి. అగ్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశం రావడం ఆ సినిమాలు హిట్ అవ్వడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా డిమాండ్ న్న హీరోయిన్ రష్మిక. ఆమె కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉందీ అనేది వాస్తవం. 

 

అవకాశాల కోసం ఆమె ఎదురు చూసే పరిస్థితి రాలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఆ వెంటనే నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమా కూడా ఆమెకు బాగా ప్లస్ అయింది. భీష్మ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. గీత గోవిందం సినిమా ద్వారా ఆమె రేంజ్ పెరిగింది. పారితోషికం కూడా ఆమె ఎక్కువగానే అక్కడి నుంచి డిమాండ్ కూడా చేస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె చేసే పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యత లభిస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 

 

ఇక ఆమెకు స్టార్ హీరో తో సమానంగా హోదా వచ్చేసింది. ఎప్పుడో హీరోయిన్ గా పరిచయం అయినా ఆ తర్వాత చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వచ్చి ఇప్పుడు కెరీర్ లో స్టార్ హీరోయిన్ అయింది. ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇలా గీత గోవిందం సినిమా ఆమె కెరీర్ కి బాగా ప్లస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: