టాలీవుడ్ లో తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్... పూజ హెగ్డే. ఆమెకు వరుస ఆఫర్లు రావడమే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు  ఇవ్వడానికి గానూ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బాలీవుడ్ హీరోలతో నటించే సత్తా ఆమెకు ఉందని భావిస్తున్న దర్శక నిర్మాతలు ఆమెకు అక్కడ అవకాశాలు ఇవ్వాలి అని భావిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మన తెలుగులో రెండు సినిమాల్లో చేస్తుంది. 

 

ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇది పక్కన పెడితే ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాలు ఆమె రేంజ్ పెంచిన సినిమాలు మాత్రం రెండు ఉన్నాయి. ఒకటి అరవింద సమేత రెండు మహర్షి సినిమా. ఈ రెండు సినిమాలు కూడా ఆమెను ఒక స్థాయిలో నిలబెట్టాయి అనేది వాస్తవం. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకునే అవసరం మాత్రం రావడం లేదు. ఇప్పుడు ఆమె ప్రభాస్ తో ఒక సినిమా అఖిల్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె భారీగానే వసూలు చేస్తుంది. 

 

ఆమెకు బాగా ప్లస్ అయిన సినిమా దువ్వాడ జగన్నాధం అయినా మహేష్ తో ఎన్టీఆర్ తో చేసిన ఆ రెండు సినిమాలే ఆమె రేంజ్ ని బాగా పెంచాయి అనేది వాస్తవం. ఆమె ఇప్పుడు బాలీవుడ్ హీరోలతో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. చిన్న చిన్న హీరోలతో ఆమె సినిమాలు చేసేది లేదని స్పష్టం చేస్తుంది. అగ్ర హీరోలతో మాత్రమే ఇక సినిమాలు చెయ్యాలి అని ఆమె నిర్ణయానికి వచ్చేసింది. ఇప్పుడు వారి తో ఆఫర్లు వస్తే మాత్రమే ఓకే చేస్తుంది పూజ.

మరింత సమాచారం తెలుసుకోండి: