టాలీవుడ్ లో ఒక్క సినిమా చేసి కనపడకుండా పోయిన హీరోయిన్ లు చాలా మందే ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ శ్వేతా బాసూ ప్రసాద్. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమెకు మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కొత్త బంగారు లోకం. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బొద్దు గా ఉన్నా సరే ఆమె చేసిన పాత్రకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో ఆమె ఎక్కడా అంటూ పలికిన ఒక చిన్న డైలాగ్ ఆమెకు మంచి పేరు తీసుకుని రావడమే కాదు అభిమానులను కూడా పెంచింది అనేది వాస్తవం. 

 

ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసినా సరే ఆమెకు మాత్రం పెద్దగా అక్కడి నుంచి ఆఫర్లు రాలేదు. ఆ తర్వాత ఆమె సినిమాలు చెయ్యాలని చూసినా సరే ఆమె తో సినిమా చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం అక్కడి నుంచి బాగా ఇబ్బంది పడింది. ఆమె సినిమాలు కోసం ఎదురు చూసిన ప్రేక్షకులకు అక్కడి నుంచి నిరాశే ఎదురైంది. ఆమెకు అవకాశాలు ఇవ్వాలని చూసినా సరే కొందరు మాత్రం ఆమెను పక్కన పెట్టారని అంటూ ఉంటారు. 

 

దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఒక హీరో కారణంగా ఆమెను పక్కన పెట్టారని చెప్తారు దర్శక నిర్మాతలు కొందరు. ఆమెకు తాము అవకాశాలు ఇవ్వాలి అని చూసినా సరే కొందరు అడ్డు పడ్డారు అని అంటారు. అందుకే ఆమె కెరీర్ లో బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అని ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె చాలానే ఇబ్బందులు పడింది. చిన్న చిన్న సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: