ప్రభాస్... టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బాహుబలి సినిమా వరకు ఈయన సినిమాలు సంవత్సరానికి ఒకటో రెండో చేస్తూ వచ్చాడు. ఇకపోతే బాహుబలి సినిమా ఎప్పుడు మొదలుపెట్టాడో ఇక అప్పటి నుంచి కేవలం బాహుబలి 2 పార్టులు కలిపి ఏకంగా ఐదు సంవత్సరాల కాలాన్ని ఆ సినిమాకు ఇచ్చాడు. అయితే ఇక ఆ తరువాత మళ్లీ ఏమైనా త్వరగా సినిమా చేశారా అంటే లేదు. సాహో సినిమాకు కూడా ఏకంగా రెండు సంవత్సరాల సమయాన్ని వెచ్చించి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అయితే భారీ బడ్జెట్ తో నిర్మించిన సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశ పరిచింది అని చెప్పవచ్చు.

IHG


అయితే ఇక ప్రస్తుతం దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ చేస్తున్న సినిమా మొదలైనప్పటికీ చాలా రోజులు అవుతుంది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నదాని పై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఇక తాజాగా హీరో ప్రభాస్ డైరెక్టర్ నాగ అశ్విన్ కలిసి నిర్మించబోతున్న పీరియాడికల్ సినిమా ఒకటి తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మించబోతున్నాడు. దీనికి యూనిట్ బృందం నుంచి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. 


ఈ సంవత్సరం న‌వంబ‌ర్ నెల నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్న, వచ్చే సంవత్సరం డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలి అని అనుకున్నారని చిత్ర బృందం తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా ఏప్రిల్ 2022 వ సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చిత్రబృందం తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: