రష్మిక మందాన... ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అందాలభామ ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం తో తన తలరాతనే మార్చేసుకుంది. ఇక అంతే తను వెనక్కి తిరిగి చూడకుండా స్టార్ హీరోల సరసన వరుసపెట్టి సినిమాలను చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రష్మిక మందన నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇది అలాగే తాజాగా నితిన్ తో బీష్మ సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించదని చెప్పవచ్చు.
రష్మిక మందన తన తదుపరి చిత్రం క్రేజీ కాంబో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ నిర్మించబోతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన కూడా నటించబోయే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో సమాచారం తెలిసిన మేరకు రష్మిక మందన కీలకపాత్ర పోషించబోతుంది అని సమాచారం. ఇందుకుగాను తను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమాలో నా నటనలో కొత్త కోణాన్ని చూస్తారు అంటూ బల్లగుద్ది చెప్పింది రష్మిక మందాన. కేవలం పుష్ప సినిమానే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించే ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ సరసన రష్మిక మందాన నటిస్తున్న సంగతి తెలిసిందే.
Every morning my love for you keeps growing. You are my dream come true. Good morning dear..!!💛🧡@iamRashmika Sweetie..!!😘💟#RashmikaMandanna ♥️ pic.twitter.com/SfaRPKpsuC
— Rashmika_Mandanna 👸❤️ (@alwaysrashmika) May 7, 2020
అయితే తాజాగా రష్మిక మందాన తన ట్విట్టర్ అకౌంట్లో " ప్రతి ఉదయం మీ పట్ల ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. మీరు నా కలలను నిజం చేశారు " అంటూ ఉదయాన్నే దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రష్మిక మందాన టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో అతి తక్కువ సినిమాలతో టాప్ హీరోయిన్ గా చలామణి కావడం నిజంగా తన అదృష్టమే.