ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చిత్ర యూనిట్ ఏ స్థాయిలో కష్టాలు పడుతుందో కూడా అందరికి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా ఇప్పుడు ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా కోసం రాజమౌళి చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆయన ఈ సినిమా తర్వాత మహేష్ తో ఒక సినిమా చేస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ సినిమా చేసే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు రాజమౌళి ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

 

అది ఏంటీ అంటే ట్రిపుల్ ఆర్ సినిమా వాయిదా అపడింది అంటే ఆయన వచ్చే ఏడాది ఆ సినిమాను విడుదల చేసి దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకుని విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ప్రస్తుతం ఆయన బాగా అలసిపోయారు అని అంటున్నారు. అందుకే ఆయన మహేష్ సినిమా మీద దృష్టి పెట్టాలి అంటే తనకు ఏడాదికి పైగా సమయం కావాలని ఆయన నిర్మాతలకు కూడా చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్ఆర్ ని రీషూట్ చేసే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

కొన్ని సీన్ లు ఆయనకు నచ్చిన విధంగా రాలేదు అని అందుకే ఇప్పుడు ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఆర్ఆర్ఆర్ కి సమయం కేటాయించే ఆలోచన లో ఉన్నారు అని అంటున్నారు. ఇక ఇది పక్కన పెడితే మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ చేసే సినిమా మీద స్పష్టత లేదు. అనీల్ రావిపూడి తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్రివిక్రమ్ తో కూడా చేసే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: