టాలీవుడ్ లో నందమూరి హీరోలకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మూడో తరం హవా నడుస్తుంది. వారిలో జూనియర్ ఎన్టిఆర్ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. నటన పరంగానే కాక సింగర్ గా, డబ్బింగ్ చెప్పటం వంటి అన్ని యూనిట్ లలో అడుగు పెట్టి తన సత్తా చాటుతున్నాడు. అయితే గత కొద్ది కాలంగా ఎన్టిఆర్ తన సోదరుడు కళ్యాణ్ రాం తో కలిసి సినిమాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు అని సిని వర్గాల్లో చర్చ జరుగుతుంది.

 

నందమూరి వంశంలో సిని రంగంలో కొనసాగుతున్న వారిలో ట్రెండ్ కి తగ్గట్టు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టిఆర్. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టిఆర్ నటన లోని  నైపుణ్యాలను మెరుగు పరచుకుంటూ అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తన నటనతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన క్రేజ్ ని తన సోదరుడు కళ్యాణ్ రాం కి కూడా పంచుతున్నాడు.

 

తాజాగా ఎన్టిఆర్, కళ్యాణ్ రాం కలిసి ఎన్టిఆర్ ప్రొడక్షన్స్ సంస్థలోనే ఎన్టిఆర్ సినిమాలన్నీచిత్రీకరణ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గాను ఆ సినిమాల పై ఎన్టిఆర్ కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నాడు. ఎన్టిఆర్ కూడా కొత్త ప్రొడక్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు హల చల్ చేస్తున్నాయి. ఈ విధంగా నందమూరి వారసులు సరి కొత్త బిజినెస్ ప్లాన్ కి శ్రీ కారం చుట్టారని తెలుస్తుంది. 

 

గతంలో ఎన్టిఆర్ ప్రొడక్షన్స్ సంస్థలో జూనియర్ చేసిన జై లవ కుశ సినిమా భారి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూనియర్ చేతిలో ఉన్న సినిమాలన్నీ ఎన్టిఆర్ ప్రొడక్షన్స్ సంస్థలోనే చిత్రీకరించాలని అనుకుంటున్నాడు. ఇక సోదరుల కొత్త బిజినెస్ ఏ విధంగా సక్సెస్ అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: