టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంతో పాటు అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'కెరటం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగచైతన్య, అల్లు అర్జున్, రామ్ తదితర స్టార్ హీరోలతో నటించిన రకుల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. బాగా పాపులారిటీని సంపాదించుకుంది. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న బ్యూటీ రకుల్. వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉండే రకుల్ కు ఇటీవల అవకాశాలు తగ్గాయి. ఇదిలా ఉండగా ఈ మధ్య ఒక ప్రముఖ మీడియాకి తన తల్లి రీనీసింగ్ తో కలిసి మొదటిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో లైఫ్ గురించి.. లవ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

 

నేను హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేయకముందే మిస్ ఇండియా కాంపిటేషన్ కి వెళ్లానని.. దానికోసం అమ్మ ఎంతగానో సపోర్ట్ చేసిందని తెలిపింది. ఆనాడు మిస్ ఇండియా పోటీలకు వెళ్తున్నప్పుడు తనమీద తనకే నమ్మకం లేదు. కానీ అమ్మ మీద మాత్రం బోలెడు నమ్మకం. 'మిస్ ఇండియా పోటీలంటే ఆశామాషీ కాదు.  అందులో బికినీ రౌండ్ కూడా ఒకటి ఉంటుంది. నేను దానికి సిద్ధంగా లేను.. కానీ అమ్మ దీనిలో తప్పేముంది.. బికినీ ధరించడానికి సిద్ధంగా ఉండమని.. నువ్వు చేయగలవు అని కాన్ఫిడెన్స్ నింపింది' అని చెప్పుకొచ్చింది. నిజానికి బికినీ అంటే నాకు బెరుకు ఉండేది.. కానీ నాకంటే మా అమ్మానాన్నే నేను బికినీ ధరిస్తే కంఫర్టబుల్‌ గా ఫీల్ అవుతారు అని రకుల్ చెప్పింది. అంతేకాకుండా మిస్ ఇండియా పోటీల దుస్తులు కూడా అమ్మే షాపింగ్‌ కు తీసుకువెళ్లి స్వయంగా కొనిపెట్టింది. ఇంకా చెప్పాలంటే మా నాన్న డల్ గా ఉండే రంగుల బికినీలు వద్దు వైబ్రంట్ కలర్స్ అయితే బికినీలు బాగుంటాయని చెప్పి ఎంకరేజ్ చేసారని రకుల్ తెలిపింది.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: