పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన 21వ చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేయనున్నాడని  తెలిసిందే. ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మించనున్నాడు. ఇక తాజాగా అశ్విన్ దత్ ఈ సినిమా  గురించి ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు. నాగ్ అశ్విన్ ఈకథ చెప్పినప్పుడు  చాలా థ్రిల్లింగ్ అనిపించింది. వెంటనే సినిమాకు ప్రభాస్ అయితే బాగుంటుందని అనుకున్నాం.. ఆతరువాత వెళ్ళి ప్రభాస్ కు స్టోరీ లైన్ ను వినిపిచాం ఆయన కూడా అంతే థ్రిల్లై సినిమా చేస్తున్నామని అన్నాడు.  స్క్రిప్ట్ కూడా పూర్తయింది. అక్టోబర్ లో ఈసినిమాను మొదలు పెట్టి 2022 లో ప్రేక్షకులముందుకు తీసుకువస్తామని అశ్విన్ దత్ అన్నారు. 
 
సైన్స్ ఫిక్షన్  నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో  ఓ బాలీవుడ్ నటి హీరోయిన్ గా నటించనుందని టాక్. ప్రస్తుతం నాగ్ అశ్విన్  నిర్మాత గా మారి జాతిరత్నాలు  అనే సినిమాను నిర్మిస్తున్నాడు. పిట్టగోడ ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ,రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి  హీరోలుగా నటిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్  డైరెక్షన్ లో తన  20వ చిత్రంలో నటిస్తున్నాడు. లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో ప్రభాస్ కు జోడిగా  పూజా హెగ్డే నటిస్తుండగా అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా   ఈసినిమాకు ఓ డియర్ లేదా రాధే శ్యామ్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: