సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే మరికొద్ది రోజుల్లో తన నెక్స్ట్ చేయబోయే 27వ సినిమాని ఎనౌన్స్ చేయనున్న విషయం తెలిసిందే. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, కొరటాల శివ లతో పాటు మహేష్ బాబు కూడా స్వయంగా ఈ సినిమా నిర్మాణంలో ఒక భాగస్వామి కానున్నారు. ఇక ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా మూడు సక్సెస్ లు అందుకని మంచి జోష్ మీద ఉన్న సూపర్ స్టార్, తదుపరి చేయబోయే సినిమాతో కూడా మరొక హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు చేయబోయే సినిమాల తాలూకు దర్శకుల లిస్ట్ చాలా భారీగానే ఉంది. కాగా పరశురాం సినిమా అనంతరం వంశీ పైడిపల్లి తో ఒక సినిమా చేయనున్న మహేష్,  ఆపై త్రివిక్రమ్ శ్రీనివాస్ లేదా అనిల్ రావిపూడి లలో ఒకరితో మరో సినిమాని చేయనున్నట్లు చెబుతున్నారు. అలాగే ఇటీవల తన నెక్స్ట్ సినిమా మహేష్ తో చేయబోతున్నట్లు ఆల్రెడీ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రకటించారు కూడా. అలానే మరోవైపు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇటీవల మహేష్ బాబుకు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ ని వినిపించినట్లు సమాచారం. 

 

ఇక మొత్తంగా ఓవైపు రాజమౌళి సినిమాతో పాటు, మరో వైపు ప్రశాంత్ నీల్ సినిమాలు కనుక ఒకదానివెంట మరొకటి వెంటవెంటనే పడితే, ఆ రెండు విజయాల తర్వాత మహేష్ బాబు, కెరీర్ పరంగా క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా అందనంత ఎత్తుకు వెళ్లిపోవడం ఖాయం అని, ఆపై ఆయనను అందుకోవటం మరే ఇతర టాలీవుడ్ హీరో కి దాదాపుగా సాధ్యం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో, మహేష్ బాబు ఆ ఇద్దరు దర్శకులతో ఎప్పుడు సినిమాలు చేస్తారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: