తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు హీరోయిన్లుగా వచ్చిన ఎంతో మంది నటీమణులు ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకుని తమ తమ ఫ్యామిలీ లైఫ్ లో పూర్తిగా స్థిరపడగా, అందులో కొందరు మాత్రం పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత పెద్ద తరహా పాత్రలు చేయడానికి రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. ఇక అలానే ఇంకొందరైతే మధ్యలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా యుక్తవయసు నుంచి పెద్ద వయసు వచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉన్నవారు కూడా ఉన్నారు. 

 

అయితే వీరందరికీ కొంత విభిన్నంగా ముందుకు నడుస్తోంది ఒక యువ నటి. ముందుగా నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఛార్మి కౌర్. ఆ తర్వాత పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న ఛార్మి, మధ్యలో మంత్ర, మంగళ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇటీవల పూరి జగన్నాథ్ తీసిన జ్యోతిలక్ష్మి సినిమాలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు ఆ సినిమాను స్వయంగా తానే నిర్మించారు ఛార్మి. ఆ విధంగా జ్యోతిలక్ష్మి ద్వారా నిర్మాతగా మారిన ఛార్మి, ఇప్పటి వరకూ వరుసగా పూరి జగన్నాథ్ తీస్తున్న అన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 

 

ఇక అప్పుడప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉండే ఛార్మి పై, మధ్యలో కొందరు అభిమానులు మీరు మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా రావాలి అంటూ కోరుతూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల చార్మి పోస్ట్ చేసిన ఒక ఫోటో పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ఎంతైనా అందంగా ఉండొచ్చు కానీ, మరీ ఇంత అందంగా ఉంటే కష్టమండి బాబు, ఇంతకీ మీ అందం యొక్క రహస్యమేమిటో మాకు చెప్పండి, వయసు పెరిగే కొద్ది కి మీలో అందం పెరుగుతోందే తప్ప తరగడం లేదు అంటూ సరదాగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: