టాలీవుడ్ లో రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మళ్ళీ నిరాశ పరచాడు. అంతక ముందు డియర్ కామ్రేడ్ కూడా భారీ ఫ్లాప్ గా మిగిలింది. ఇలా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపయిన పూరి జగన్నాధ్ తెరకెక్కించే సినిమాలో నటించేందుకు సిద్దం అయ్యాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసందే.

 

ఇక ఈ సినిమా తర్వాత నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించబోయో సినిమాలో నటిస్తాడు. వాస్తవంగా ఈ సినిమా పూరి జగన్నాధ్ సినిమా కంటే ముందే మొదలవ్వాల్సింది. కాని డియ కామ్రేడ్ ఫ్లాప్ తో డైలమాలో పడ్డ విజయ్ దేవరకొండ ఇస్మార్ట్ శంకర్ తో భారీ సక్సస్ అందుకున్న పూరి జగన్నాధ్ తో సినిమాకి కమిటయ్యాడు. ఈ సినిమా కంప్లీట్ చేసి శివ నిర్వాణ తో సెట్స్ మీదకి వస్తాడని లేటెస్ట్ న్యూస్.

 

ఇక మరో రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి... దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ ఒక సినిమాలో నటించడానికి ఇంతకముందే కమిటయ్యాడట. శివ నిర్వాణ సినిమా అయిపోగానే ఈ సినిమా చేస్తాడట. అంతేకాదు అర్జున్ రెడ్డి కాంబో మళ్ళీ రిపీట్ కానుందని మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా విజయ్ దేవరకొండ కి ఒక కథ చెప్పి ఒప్పించాడు. ఈ మూడు సినిమాలు అయిపోగానే సందీప్ రెడ్డి వంగా సినిమాలో నటిసాడని లేటెస్ట్ న్యూస్. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రస్తుతం శివ నిర్వాణ నేచురల్ స్టార్ నాని తో తెరకెక్కిస్తున్న టక్ జగదీష్ విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా అని అంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నాని చేతికి వచ్చిందట. అందుకే విజయ్ తో అనుకుంటున్న సినిమాని కూడా క్లాస్ సినిమాగానే శివ నిర్వాణ ప్లాన్ చేస్తున్నాడట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: