మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు చిత్ర యూనిట్. లాక్ డౌన్ సడలించగానే జూన్ లేదా జూలై నుండి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. 2021 సంక్రాంతి కి రిలీజ్ చేయాలని కొరటాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాం చరణ్ కూడా ముఖ్య పాత్ర లో కనిపించబోతున్నాడు. 

 

సినిమా తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ లో నటిస్తారు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం రీమేక్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన..మిగతా విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాని లూసీఫర్ లో సల్మాన్ నటిస్తున్నాడన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదట. 

 

అందుకు కారణం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఇప్పటికే రెండు భారీ సినిమాలలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ మొదలై ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలని కంప్లీట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడట. ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమా రంజాన్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఈ ఫెస్టివల్ సల్మాన్ ఖాన్ చాలా సెంటిమెంట్. రంజాన్ కి రిలీజైన సల్మాన్ ఖాన్ సినిమాలు భారీ సక్సస్ ని అందుకున్నాయి.

 

కాని ఈ సారి లాక్ డౌన్ కారణంగా తన సినిమాని రిలీజ్ చేయడం సాధ్యం కాలేదు. ఇక ఈ సినిమాతో పాటు కభీ ఈద్ కభీ దివాళి అనే సినిమాలోను సల్మాన్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేయడమే సల్మాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో సల్మాన్ ఖాన్ ఫుల్ బిజీ అందుకే లూసీఫర్ లో నటించడానికి కుదరదని అంటున్నారు. ఇక ఒక సినిమాలో సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: