మామూలుగానే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ టాలీవుడ్లో హిట్ కాంబినేషన్ ఎంతో క్రేజ్ వున్న కాంబినేషన్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇక మొన్నటికి మొన్న అల వైకుంఠ పురములో సినిమాతో బన్నీ  బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు అనే చెప్పాలి. తాజాగా తన హిట్ దర్శకుడితో   సినిమా తెరకెక్కుతోంది. మొన్ననే బ్లాక్ బస్టర్... ఇక ఇప్పుడు ఆ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దీంతో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాకు సంబంధించి ఏదో ఒక క్రేజీ  న్యూస్ ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది. 

 

 

 ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడా ఒక రేంజ్ లో అభిమానులను ఆకర్షించింది అని చెప్పాలి. ఎంతో నాచురల్ లుక్కుతో ఫుల్ మాస్ గా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని అల్లు అర్జున్ అభిమానులు అందరూ నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమాలోని ఓ ఆరు నిమిషాల ఎపిసోడ్ కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీక్వీన్ రష్మిక మందన నటిస్తోంది. ఇక బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, బాబి సింహాలు ముఖ్య పాత్రల్లో  కనిపించనున్నట్లు సమాచారం.

 

 

 ఇక ఏ విషయంలో అయినా కొత్తగా ఆలోచించే దర్శకుడు సుకుమార్..ఈ  సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ విషయంలో కూడా కొత్త  డిజైన్ చేయాలని అనుకుంటున్నాడట. ఆరు నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సన్నివేశం కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెట్టనున్నారట. అయితే పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఏదేమైనా అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ రేంజ్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: