ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ రేంజ్ లో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చేవి. ఎన్టీఆర్ - నాగేశ్వరరావు, కృష్ణ - శోభన్ బాబు లాంటి స్టార్స్ కలిసి నటించిన సినిమాలో ఎన్నో ఉన్నాయి. అయితే ఆ తరువాత జనరేషన్ లో మల్టీ స్టారర్ సినిమాలు పూర్తిగా ఆగిపోయాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు హీరోలు గా ఉన్న సమయంలో మల్టీ స్టారర్ సినిమాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది.
ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సూపర్ హిట్ కావటంతో మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. ఇక ఇప్పుడు సౌత్లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు గా నటిస్తున్నారు. దీంతో మరిన్ని భారీ చిత్రాలు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే అభిమానులు మాత్రం ఓ క్రేజీ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
అదే నందమూరి హీరోల మల్టీ స్టారర్. నందమూరి స్టార్ హీరో ఎన్టీఆర్, నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ హీరోలు గా ఓ మల్టీ స్టారర్ సినిమా వస్తే చూడాలి అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో పలుమార్లు ఈ కాంబినేషన్ పై రకరకాల వార్తలు వినిపించినా ఇంత వరకు దర్శకులు ఎవరు ఆ దిశగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. మనం సినిమా రిలీజ్ తరువాత నందమూరి ఫ్యాన్స్ లో అలా ఓ ఫ్యామిలీ మల్టీ స్టారర్ వస్తే చూడాలన్న కోరిక బలపడింది. అయితే ఇటీవల కాలంలో ఎన్టీఆర్, బాలయ్యల మధ్య సంబంధాలు అంత బాగా లేవన్న ప్రచారం ఉంది అంటే ఇక ఈ కాంబినేషన్ తెర మీదకు రానట్టే అని భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా నందమూరి హీరోలు మల్టీ స్టారర్ కోసం ఆలోచిస్తారేమో చూడాలి.