టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చిన్న హీరోల సినిమాలకు ఆదరణ పెరిగింది అనేది వాస్తవం. చిన్న హీరోలు ఒక్క సినిమా చేసినా సరే వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. నానీ, శర్వానంద్, నిఖిల్ వంటి హీరోలు ఈ మధ్య కాలంలో మంచి హిట్స్ కొడుతున్నారు. చిన్న చిన్న సినిమాలు అయినా సరే ప్రేక్షకులు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు చూడటానికి. కథ బాగుంది అంటే చాలు ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూసే పరిస్థితి ఉంది ప్రస్తుతం టాలీవుడ్ లో అనేది వాస్తవం. ఇక చిన్న హీరోలు ఈ మద్య కాలంలో ఎక్కువగా ప్రయోగాలు కూడా చేస్తున్నారు. 

 

అందులో ప్రధానంగా నానీ... నానీ ఎక్కువగా ప్రయోగాల మీద ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇక అతను సేఫ్ జోన్ లో సినిమాలను చేస్తున్నాడు అనే ప్రచారం కూడా టాలీవుడ్ లో ఉంది. నానీ ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అనేది అర్ధమవుతుంది. అతను ఈ మధ్య త్రివిక్రమ్ తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అనుకుని చర్చలు కూడా జరిపాడు. త్రివిక్రమ్ నుంచి ఏ స్పందానా పూర్తిగా రాలేదు గాని ఆయన ఒప్పుకుంటే కచ్చితంగా మల్టీ స్టారర్ సినిమా చేయడానికి నానీ ముందుకు వచ్చాడు అని టాలీవుడ్ జనం అంటున్నారు. 

 

సినిమా కోసం నానీ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నానీ తన సినిమాలో ఎప్పుడు కూడా కథ కొత్త గా ఉండే విధంగా ఉంటుంది. టాలీవుడ్ లో ఇప్పుడు దర్శక నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల మీద ఫోకస్ చేసారు. చిన్న సినిమాలు అయినా సరే ఇలా వస్తే మంచి విజయం సాధిస్తాయి అనేది దర్శకుల హీరోల నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: