కథా రచయితగా మంచి పేరున్న వక్కంతం వంశీ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం `నాపేరు సూర్య` ఈ చిత్రంతోనే డైరెక్టర్ గా మారారు. ఆ సినిమా అనుకున్నంత హిట్ కొట్టలేదు కానీ ఈ చిత్రంలోని క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఐతే బన్నీ క్యారక్టరైజేషన్ పరంగా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈచిత్రంలో నటించిన మిగతా పాత్రలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పాత్రలనే చెప్పాలి. ఆ సినిమా విడుదలై చాల కాలం అవుతున్నా వక్కతం వంశీకి మరో మూవీ డైరెక్ట్ చేసే అవకాశం రాలేదు. మొదటి సినిమానే ఫ్లాప్ అయినందువల్లనో ఏమోగాని పెద్దగా హిట్ అయితే కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ స్టార్ రైటర్ మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ప్లాన్ వేశాడట. ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట.
అయితే ఆయన చెప్పిన స్టోరీ లైన్ రవితేజకు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో వంశీ పడ్డాడట. రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న వంశీ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి దర్శకుడిగా సెటిల్ అవ్వాలని చూస్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం రవితేజ గోపి చంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ మూవీలో నటిస్తున్నారు. మరి ఒకరకంగా చెప్పాలంటే రవితేజ కూడా ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి సందర్భాల్లో ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నాడో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక రవితేజని అంతలా మెప్పించిన కథ ఏంటి అందులో రవితేజ క్యారెక్టర్ ఎలా ఉంబడబోతుంది ఈ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అలాగే ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్లన్నిటికి కాస్త బ్రేక్ వచ్చింది. లేదంటే ఈ పాటికి క్రాక్ మూవీ ఓ కొలిక్కి వచ్చేది. మరి ఈ సందర్భంగా సినిమాలన్నీ కూడా కాస్త టైమ్ పట్టేటట్టూనే ఉన్నాయి. ఇక రవితేజ క్రాక్ కూడా ఎప్పుడు వస్తుంది ఏమిటా కథ అన్న విషయాలు కూడా ఎటువంటి సమాచారం లేదు.