టాలీవుడ్ లో కొంత కాలంగా యువ దర్శకులు మంచి జోష్ కొనసాగిస్తున్నారు. సినీయర్ దర్శకులు ఇటీవల కాలంలో కాస్త ఊపు తగ్గినా.. కుర్ర డైరెక్టర్లు ఒకటి రెండు సినిమాలతో తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. సీనియర్ హీరోలు సైతం యువ దర్శకులకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి నెలకొంది.  తాజాగా హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ తో 'కార్తికేయ' సినిమాతో దర్శకుడిగా తానేమిటనేది చందూ మొండేటి నిరూపించుకున్నాడు. ఈ మూవీ ఇద్దరి మంచి లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఆయన తెరకెక్కించిన 'ప్రేమమ్' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైతూకు ప్రేమకథలు బాగా సెట్ అవుతాయనే టాక్ కి ఈ సినిమా మరింత బలాన్ని చేకూర్చింది. కోలీవుడ్ రిమేక్ అయినా ఈ మూవీ తెలుగు నేటివిటీతో చాలా బాగా తెరకెక్కించాడని మంచి మార్కులు పడ్డాయి.

 

 ఆ తరువాత చైతూతో ఆయన 'సవ్యసాచి' అనే సినిమా చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఈ మూవీలో మాధవన్ లాంటి టాప్ హీరో విలన్ గా నటించినా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగు సమయంలోనే చైతూకి,  చందూకి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే టాక్ వచ్చింది. ఒక విషయం కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందనే ప్రచారం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.

 

తాజాగా ఈ విషయం పై స్పందించాడు యంగ్ డైరెక్టర్. నాగ చైతన్య చాలా కూల్ గా ఉంటారని.. ఎలాంటి ఈగో ఫీలింగ్స్ అతనిలో ఉండవని అన్నారు.  నేను .. చైతూ  గొడవ పడినట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. నాకున్న మంచి స్నేహితుల్లో చైతూ ఒకరు. త్వరలోనే ఆయనతో ఒక సినిమా ఉంటుంది. ప్రస్తుతం నేను 'కార్తికేయ 2' సినిమా పనుల్లో వున్నాను. త్వరలో చైతూ దగ్గర నుంచి కాల్ వస్తుందనే అనుకుంటున్నాను  అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: