బుల్లితెరపై అప్పటికే సుమ, అనసూయ లాంటి వాళ్లు యాంకర్స్‌ గా ఏలేస్తున్న తరుణంలో అడుగుపెట్టింది రష్మీ. అయితే మొదట్లో తెలుగు ఉచ్ఛారణలో తడబడినా.. మెల్లిమెల్లిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇతర యాంకర్లకు పోటీగా నిలబడింది. యాంకరింగ్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న ఈమె.. పలు బుల్లితెర కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ గ్లామర్‌ ఒలకబోస్తోంది. గత ఏడేళ్లుగా రష్మీ.. తన మ్యాజిక్‌ను చూపిస్తూ ఎవర్‌ గ్రీన్‌గా అలా రాణిస్తూనే ఉంటోంది. జబర్దస్త్‌లో ఓ వెలుగు వెలిగే సరికే అందరి నోళ్లలో నానింది. ఎక్కడ చూసిన రష్మీ పేరే.. రష్మీ - సుధీర్ జంట గురించే టాపిక్ నడిచేది. జబర్దస్త్, ఢీ, స్పెషల్ ఈవెంట్స్‌తో ఫుల్ పీక్స్‌లో ఉన్న రష్మీ.. వెండితెరపై దృష్టి సారించింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి గల కారణాలు చెప్పింది రష్మీ. 

 

మొదట వెండితెరపై చిన్నచిన్న పాత్రల్లో మెరిసిన ఆమె.. ఆ తర్వాత ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ యువ ఆడియన్స్ అందరినీ బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. గ్లామరస్ యాంకర్‌గా బుల్లితెరపై ఎవర్‌గ్రీన్‌ అనిపించుకున్నా గానీ వెండితెరపై సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో తప్పుచేసి సక్సెస్ కాలేకపోయానని అంటోంది రష్మీ గౌతమ్. కాగా తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన రష్మీ.. బుల్లితెరపై తనకున్న క్రేజ్ వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టిందని, దాంతో ఒక్కో సినిమా చేస్తూ వెళ్లానని చెప్పింది. ఈ క్రమంలోనే 'గుంటూరు టాకీస్' సినిమా చేశానని, అయితే ఆ మూవీలో గ్లామర్ డోస్ ఎక్కువగా వడ్డించి సెక్సీ లుక్‌‌లో కనిపించడమే దెబ్బేసిందని చెప్పుకొచ్చింది. అలా చూసిన దర్శకనిర్మాతలంతా మళ్ళీ అలాంటి రోల్స్ మాత్రమే ఆఫర్ చేశారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: