యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమా తో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయి లోనే ఇండియన్ పాన్ ఇండియ సూపర్ స్టార్ గా మారిపోయాడు. 'బాహుబలి' సినిమా ప్రభాస్ కెరీర్ లో వండర్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్ లో పెరిగింది. ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో  ‘బాహుబలి’ స్థాయిలో విజయం సాధించాలని యాక్షన్ ఓరియంటెడ్ సినిమా 'సాహో' చేయడం జరిగింది. దాదాపు ప్రభాస్సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు షూటింగ్ కి టైం కేటాయించడం జరిగింది. అయితే సినిమా రిలీజ్ అయిన మొట్టమొదటి షోకి అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినాగానీ భారీ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధ కృష్ణ దర్శకత్వంలో హీరో గా నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్ ఆగిపోయింది.

 

సినిమా అయిన వెంటనే నెక్స్ట్ నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అశ్వినీదత్  మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నాగ్ అశ్విన్ మొత్తం కంప్లీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా కియారా అద్వానీ నటించే ఉందని ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉండగా అశ్వనీ దత్ ప్రభాస్ గురుంచి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైజయంతి మూవీస్ సంస్థ ద్వారా ప్రభాస్ ను హీరోగా అప్పట్లో పరిచయం చేయాలనుకున్నా అని వ్యాఖ్యానించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అవకాశం దక్కలేదని అన్నారు. 

 

బాహుబలి చిత్రం అనంతరం ప్రభాస్ నేషనల్ వైడ్ స్టార్ హీరో అయ్యారు. ప్రభాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ సిద్దం చేసినట్లు వివరించారు. ఈ చిత్రం 2022 ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానులు అశ్వినిదత్ వ్యాఖ్యలు విని ప్రభాస్ సినిమా క్లారిటీ గా విడుదల గురించి మొదలవకు ముందే చెప్పింది మీరే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. సినిమా మీద ఇంత గ్రిప్ ఉంటే చాలు సమయానికి రిలీజ్ అవడం గ్యారెంటీ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: