బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. అతని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సాహో సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. 

 

సినిమా తర్వాత ప్రభాస్ ఒక సినిమాను అశ్వినిదత్ నిర్మాతగా చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రభాస్ కష్టపడుతున్నాడు. ఈ సినిమా కథను కూడా చిత్ర యూనిట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్దం చేసి మరోసారి ప్రభాస్ కి వినిపించే ప్రయత్నాలు చేస్తుంది. కథలో కొత్తదనం ఉండే విధంగా చూడాలి అని ప్రభాస్ సూచనలు చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా నిర్మాత కూడా ప్రభాస్ కి మంచి ఆఫర్ ఇచ్చారు సినిమా షేర్ తీసుకోవాలని సూచించారు అని టాక్. 

 

ప్రభాస్ కూడా అందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాను లేట్ అయినా పర్వాలేదు గాని అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కు ప్రీ రిలీజ్ మార్కెట్ కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని. ఒక నిర్మాతసినిమా హక్కుల కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. సదరు నిర్మాతకు కథ తెల్సు అని ఆయనే ఈ సినిమా చెయ్యాలని చూసినా కుదరలేదు అని అందుకే అశ్విని దత్ చేస్తున్నట్టు సమాచారం. ఎలా ఉన్నా ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: