సూపర్ స్టార్ మహేష్ బాబు 2020 ప్రారంభంలోనే సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వంశీపైడిపల్లి తో వెంటనే సెట్స్ మీదకి కొత్త సినిమాతో వెళతాడని సమ్మర్ కి ఆ సినిమా రిలీజ్ అవుతుందనుకున్నారు. అయితే కథ మహేష్ బాబు కి సూటవదన్న ఆలోచనతో ఈ సినిమా నుండి డ్రాపయ్యారు. 

 

ఇక మహేష్ బాబు ఎఫ్ 3 తో రెడీ అవుతున్నాడని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరిగింది. కాని ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా సిద్దం చేసే పనిలోనే ఉన్నాడు అనిల్ రావిపూడి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడని ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని మే మూడో వారం నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో నటించబోతున్నందుకు గాను మహేష్ బాబు రెమ్యూనరేషన్ 40 కోట్లని అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా మహేష్ బాబు చేయడం లేదని అంటున్నారు. 

 

ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో సినిమా మొదలవబోతుంది. ఈ సినిమాని 2020 ఆఖరున రిలీజ్ కూడా అనుకున్నారు. ప్రస్తుతానికి హీరోయిన్స్ గా వినిపిస్తున్న పేర్లు కీర్తి సురేష్, కియారా అద్వాని. అయితే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పరశురాం మహేష్ బాబు సినిమా మే 31 న ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయో సినిమాలో నటిస్తాడని అఫీషియల్ గా వచ్చిన వార్తే అయినప్పటికి ఈ సినిమా మొదలవడానికి దాదాపు ఇంకా సంవత్సరం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

 

అయితే ఈ మద్యలో మహేష్ బాబు కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే పాన్ ఇండియా సినిమాలో నటిస్తాడని వార్తలు రాసుకొచ్చారు. కాని తాజా గా మహేష్ బాబు కమిటయిన సినిమాలని బట్టి చూస్తే ఈ కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో ఉండదని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: