సాహో తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ 'జిల్' ఫేమ్.. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాకి "జాన్", "ఓ డియర్", "రాధే శ్యామ్" టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ జార్జియాలో కొంత భాగం జరిపిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా ఇండియాకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. మిగతా భాగాన్ని ఇక్కడే సెట్ వేసి చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేస్తాడు ప్రభాస్. 

 

సినిమా వైజయంతి మూవీస్ కి 50 వ సినిమా కావడం విశేషం. దాంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక ఎన్.టి.ఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాతో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లను పాన్ ఇండియా స్టార్స్ గా భారీ క్రేజ్ వచ్చేలా తెరకెక్కిస్తున్నారు.

 

అయితే ఇప్పటికే టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ అన్న క్రేజ్ విపరీతంగా ఉంది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్ చరణ్ లు కూడా పన్న్ ఇండియా స్టార్స్ గా మారబోతున్నారు. అయితే చరణ్ ఆల్రెడి హిందీలో సినిమా చేసిన సంగతి తెలిసిందే. కాని ఇప్పటి వరకు ఎన్.ట్.ఆర్, ప్రభాస్ డైరెక్ట్ గా బాలీవుడ్ లో సినిమా చేయలేదు.

 

అయితే ప్రభాస్ కి బాహుబలి తర్వాత బాలీవుడ్ అవకాశాలు వచ్చినా ఎందుకనో ఒప్పుకోలేదు. ఇప్పుడు అలాగే ఎన్.టి.ఆర్ కి బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయట. మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందు మాత్రం ప్రభాస్ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: