బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. రాజమౌళి సృష్టించిన ఈ వెండితెర కావ్యానికి ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. అయితే బాహుబలి స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోలందరి దృష్టి పాన్ ఇండియా సినిమాల మీదే ఉంది.

 

 

తెలుగు సినిమా మార్కెట్ పెరగడంతో ఒక్కొక్కరూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత, మళ్ళీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే హీరో ఎవరా అని జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం అవుతున్నారు.

 

 

అర్జున్  రెడ్డితో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ ద్వారా బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. మంచు విష్ణు మోసగాళ్లు, మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో రూపుదిద్దుకుంటున్నాయి. ఇకపోతే తెలుగు పరిశ్రమ నుండి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతుందట.

 

తెలుగులో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన నిర్మాత దిల్ రాజుకి పాన్ ఇండియా మీద మనసు పడిందట. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పూర్తికాగానే ఈఇ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద పనులు కూడా జరుగుతున్నాయట. ఇంద్రగంటి మోహనక్రిష్ణ ఈ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేశాడట. అయితే అన్నీ ఉన్నాయి కానీ హీరో మాత్రం దొరకలేదట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి హీరో దొరగ్గానే పాన్ ఇండియా మూవీ మొదలెట్టేస్తాడని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత వాస్తవముందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: