ప్రపంచం మొత్తం కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కుకుపోయింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో అన్ని దేశాలు కరోనా మహమ్మారి నివారణకు లాక్ డౌన్ విధించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, కూలీలు, నిరాశ్రయల సహాయార్ధం సినీ రాజకీయ ప్రముఖులు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. దీన్ని అరికట్టడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు కూడా దీని బారిన పడడం అందరినీ భయం భ్రాంతులకు గురిచేస్తుంది. మనల్ని వారు కాపాడాలంటే మనం వారిని కాపాడాలి. కానీ వారికి సరైన రక్షణ పరికరాలు లేకపోవడం వలన వారు వైరస్ బారిన పడుతున్నారు.
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే సామాజిక సేవకై నడుం బిగించింది. కోవిడ్ వైరస్ పై యుద్ధంలో ఓ అడుగు ముందుకు వేసింది. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మొదలైన వారికి పి పి ఈ (పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్) కిట్స్ అందజేయడం అవసరమని.. దీని కోసం విరాళాలు పంపవలసిందిగా పూజ హెగ్డే కోరుతున్నారు. www.tring.co.in వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి తమ విరాళాలు పంపవలసిందిగా ఓ వీడియో సందేశం ద్వారా పూజ హెగ్డే తెలియజేశారు. మీకు తోచినంత సహాయం చేయమన్న పూజ హెగ్డే.. విరాళం పంపిన వారి గురించి స్పెషల్ వీడియో ద్వారా తెలియజేస్తాను అన్నారు. ఒక్కొక్క పి పి ఈ కిట్ ధర రూ. 650/- వరకూ ఉండగా ఏపీ మరియు తెలంగాణాలో వైద్య సిబ్బందికి అందజేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు. ఏదేమైనా ముద్దుగుమ్మ పూజా హెగ్డే చేస్తున్న పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' సినిమాలోనూ కనిపించనుంది. ఇక బాలీవుడ్ లో సైతం ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. రీసెంటుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతోపాటు తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటిస్తున్నది.