అలవైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్, తర్వాతి చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసి సంచలనం సృష్టించాడు. దాంతో బన్నీ- సుకుమార్ ల కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం రివేంజ్ డ్రామాగా ఉండనుందట.

 

 

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లా లో సాగే ఈ కథలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో బన్నీ చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడుతాడట. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతుంది. 

 

 

అయితే అల్లు అర్జున్ కి తెలుగుతో పాటు మళయాలంలోనూ మంచి మార్కెట్ ఉంది. అల్లు అర్జున్ ప్రతీ సినిమా మళయాలంలోనూ విడుదలయ్యి మంచి కలెక్షన్లని వసూలు చేస్తుంటుంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం బాగా డబ్బులు ఖర్చుపెడుతున్నారు.ఒకానొక యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా ఆరుకోట్లకి పైగా ఖర్చు చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉండనుందట. 

 

 

ఆద్యంతం అడవుల్లో సాగే ఈ సినిమాలో అబ్బురపరిచే యాక్షన్స్ సీక్వెన్సెస్ బాగా ఉన్నాయట. ఇవన్నీ ప్రేక్షకుల మంచి అనుభూతిని కలిగిస్తాయని అంటున్నారు. అందుకోసం పుష్ప సినిమా కోసం ౧౨౫ నుండి ౧౫౦ కోట్ల బడ్జెట్ అవనుందని అంటున్నారు. మైత్రీమూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: