సాయి పల్లవి కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తొలి సినిమాలోనే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ హీరో వరుణ్ తేజ్ సరసన సాయి పల్లవి నటించింది. విశేషం ఏంటంటే ఫిదా సినిమా వలన వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవికే ఎక్కువగా పాపులారిటీ వచ్చింది. సాయి పల్లవి స్థానంలో వేరే ఒకరు నటించినట్లుయితే సినిమా కచ్చితంగా డిజాస్టర్ అయ్యేదని చాలా మంది అభిప్రాయపడ్డారు కూడా. ఫిదా సినిమా తర్వాత కూడా సాయి పల్లవి తన అందచందాలతో, నటన చాతుర్యంతో ఎన్నో సినిమాలను భారీ హిట్స్ చేసింది. మారి 2 సినిమాలో రౌడీ బేబీ అనే పాటకి అద్భుతంగా డాన్స్ చేసి దక్షిణ భారత దేశ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది అభిమానులను చూరగొన్నది.


ఆమె ప్రస్తుతం నాగ చైతన్య తో కలసి లవ్ స్టోరీ సినిమాలో, దగ్గుపాటి రానా తో కలిసి విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. ఇంకా చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇటువంటి ఫుల్ క్రేజ్ సమయంలో ఆమె తన 28వ పుట్టినరోజు ఈరోజు అనగా మే 9 2020 న జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.


తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ కి చెందిన సెంతామరై, రాధామణి దంపతులకు మే 7వ తేదీన 1992 వ సంవత్సరంలో కోటగిరి లో జన్మించింది. నిజానికి ఈ ముద్దుగుమ్మ పేరు సాయి పల్లవి కాదు. ఆమె తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో తన కూతురికి అసలు పేరు తీసేసి సాయి పల్లవి అని నామకరణం చేసిందట. సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు సాయి పల్లవి జార్జియా లో వైద్య విద్యను అభ్యసించింది. ఆ తర్వాత కార్డియాలజిస్ట్ అవ్వాలనుకుంది కానీ అనుకోకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. అయితే ఆమె ముద్దు సీన్లు చేయడానికి గాని, శృంగార సన్నివేశాల్లో నటించడానికి అసలు ఒప్పుకోదు. అందుకే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మూవీ లో నటించడానికి ఆమె ససేమిరా అని ఈజీగా వదిలేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: