క‌రోనా కోర‌లు చాచిన వేళ ప్ర‌తి ఒక్క‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఎవ్వ‌రూ క‌నీస అవ‌స‌రం ఉంటే త‌ప్పించి బ‌య‌ట‌కు రావ‌డానికి లేదు. గ‌త రెండు నెల‌లుగా ఇదే జ‌రుగుతుంది. మొత్తం దేశం లాక్ డౌన్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఇది అన్ని కార్యకలాపాలకు చెక్ పెట్టేసింది. అన్ని పారిశ్రామిక రంగాలను తీవ్రంగా ఆర్ధికంగా దెబ్బ‌తీసింద‌నే చెప్పాలి. దీనివ‌ల్ల‌ ముఖ్యంగా టాలీవుడ్ ఎక్కువగా నష్టపోతోంది. ప్ర‌స్తుతం టాప్ టాలీవుడ్ తారలు స్వీయ‌నిర్భంధన‌లో ఉండిపోయారు. ఆ క్ర‌మంలోనే తమ వ్య‌క్తిగ‌త‌ వీడియోలు, రహస్యాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ కాస్త ఫ్యాన్స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. కరోనావైరస్ తో పోరాటంపై ప్రజలలో అవగాహన కల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 

టాలీవుడ్ స్టార్ల‌లో మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ సామాజిక మాధ్య‌మాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. త‌మ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో వాళ్ళు స్పెండ్ చేసే టైమ్  అలాగే వారు చేసే కార్యక‌లాపాల‌న్నీ కూడా వీడియోల రూపంలో త‌మ సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ వ్యవధిలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహేష్ బాబు .. ఇదే స‌మ‌యంలో సోషల్ మీడియాలోకి ప్రవేశించిన చిరంజీవి తనదైన శైలిలో జెట్ స్పీడ్ తో స‌మాచారాన్ని అందిస్తూ ర‌క‌ర‌కాల అంశాల్ని ప్ర‌స్థావిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

 

చిరు స్పీడ్ పై విమర్శలు ఉన్నా.. ఆయ‌న ఎందులోనూ ఎక్క‌డా కూడా వెనక్కి తగ్గడం లేదు. చిరంజీవి .. మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రేమికులకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు. ర‌క‌ర‌కాల రహస్యాలు పంచుకోవడం ద్వారా ఆనందాన్ని షేర్ చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో, చిరంజీవిమహేష్ బాబులలో ఎవరు లాక్ డౌన్ వార్ లో విన్న‌ర్? అంటూ ఫ్యాన్స్ లో డిబేట్ న‌డుస్తోంది. చివ‌రికి ఎవరు గెలుస్తారో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: