ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ ప్రముఖులందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలుసిందే . అయితే ప్రస్తుతం సినిమాలకు దూరమవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఏదో ఒక విధంగా అలరిస్తూనే ఉన్నారు సినీ ప్రముఖులు. కొంతమంది తాము ఫిట్నెస్ పై దృష్టి పెడుతూ ఉంటే ఇంకొంతమంది వంటింట్లోకి చేరి వంట నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏదేమైనా అభిమానులకు మాత్రం ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఇక తాజాగా లాక్ డౌన్ ఉద్దేశించి మాట్లాడిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. అజయ్ దేవగన్ తన భార్య హీరోయిన్ కాజల్ తో ఉన్న ఒకప్పటి ఫోటోని పోస్ట్ చేసిన అజయ్ దేవగన్... నాకు లాక్ డౌన్ ప్రారంభమయ్యి 20 ఏళ్లు అయినట్లు అనిపిస్తుంది అంటూ సరదాగా కామెంట్ ని పెడుతూ దానికి కాజోల్ ని ట్యాగ్ చేసాడు.
ప్రస్తుతం అజయ్ దేవగన్ పెట్టిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. హల్బుల్ అనే ఓ సినిమా చిత్రీకరణలో కలుసుకున్న కాజొల్ అజయ్ దేవగన్ 1999లో వివాహం చేసుకొని ఒకటైన విషయం తెలిసిందే. వీళ్లు వివాహం చేసుకోక ముందే కాదు వివాహం చేసుకున్న తర్వాత కూడా కలిసి చాలా సినిమాల్లో నటించారు. గుండా రాజ్, ఇష్క్ దిల్ క్యా కరే, రాజు చాచా లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ బాలీవుడ్ క జోడి. అయితే బాలీవుడ్ లో ఎంతమంది కొత్త జంటలు ఉన్నప్పటికీ కాజోల్ అజయ్ దేవగన్ జంట మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీన్ గా నిలుస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.
ఇకపోతే ఇద్దరి జోడి కి పెళ్లి తర్వాత 2003 సంవత్సరంలో కుమార్తె నైస జన్మించగా 2010లో కుమారుడు యుగ్ జన్మించారు. ఏదేమైనా ప్రస్తుతం అజయ్ దేవగన్ పెట్టిన పోస్టు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.కాగా ఈ రియల్ లైఫ్ భార్య భర్తలు రీల్ లైఫ్లో కూడా ఎన్నో సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. ఎన్నో చారిత్రాత్మకమైన సినిమాలతో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాల్లో నటించింది ఈ బాలీవుడ్ జంట. ప్రస్తుతం అజయ్ దేవగన్ సినిమాలతో పాటు అటు అడ్వర్టైజ్మెంట్ లలో కూడా దూసుకుపోతున్నారు. అటు కాజల్ కూడా వైవిద్యాత్మకమైన పాత్రలు వచ్చినప్పుడు తప్పకుండా నటిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది.
View this post on InstagramFeels like it’s been twenty two years since the lockdown began. #FridayFlashback @kajol